21వ కాపు కులస్తుల కార్తీక మాస వన భోజన మహోత్సవ కార్యక్రమం నవంబర్ 14 వ తేదీ ఆదివారం ఎస్ వి నగర్ నాగారం లోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు కాపు కులాల ఐక్యవేదిక అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి శ్రీనివాసరావు, దాసరి ప్రసాద్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు బంధు మిత్రులందరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు పూజ కార్యక్రమంతో ప్రారంభమై కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ అనంతరం సభా కార్యక్రమాలు, సాంస్కృతిక, క్రీడలు, వివిధ రకాల ఆటలు నృత్య ప్రదర్శనలు జరుగుతాయని సాయంత్రం నాలుగు గంటల వరకు ముగుస్తుందని తెలిపారు.
సాంస్కృతిక మరియు క్రీడల్లో పాల్గొన దలచినవారు పోతురాజు సెల్ 9705070126, కొల్లా రామారావు 9701996307 లను సంప్రదించాలని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ లలో అత్యధిక మార్కులు సంపాదించి ఎంసెట్లో ర్యాంకు సంపాదించిన వారు, జాతీయస్థాయి రాష్ట్రస్థాయి క్రీడలలో సర్టిఫికెట్లు పొందినవారు వై వి రాంబాబు 9989244953, దాసరి ప్రసాద్ 9246153472 లను సంప్రదించాలని సూచించారు. మధ్యాహ్నం భోజనం, అవార్డుల బహుకరణ, బహుమతి ప్రధానం, ముగింపు సందేశంతో ముగుస్తుందని అని పేర్కొన్నారు.