చీరాలలో తెలుగుదేశం పార్టీ జెండాను మళ్లీ ఎగరేస్తానంటూ కరణం బలరాం కుమార్తె పేరుతో వెలిసిన పోస్టర్లు ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం అనంతరం అనధికారికంగా పార్టీ ఫిరాయించి వైసీపీలో చేరారు. బలరాం కుమారుడు వెంకటేష్ వై సి పీ లో ఉండగా ఆయన వై సి పీ కి మద్దతు ప్రకటించిన విషయం విదితమే.
ఈ నేపధ్యంలో కరణం బలరాం కుమార్తె కరణం అంబికా కృష్ణ చీరాలలో వాల్ పోస్టర్లు వేయించారు. చీరాలలో మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని, నిరంకుశ వైసీపీ ప్రభుత్వం విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.
చీరాల మొత్తం పోస్టర్లు వెలయడంతో చెలరేగిన సంచలనానికి ఒక్క సారిగా అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి దాంతో వారు కొందరు మనుషుల్ని పెట్టి ఆ వాల్ పోస్టర్లను చించేయించారు.