కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీ ఆటో ను ఢీ కొట్టడం తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మృతులు మ్యాక నర్సయ్య, బాబు, మ్యాక బాణయ్య, మ్యాక శంకర్ అని తెలిసింది. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామం విషాదంతో నిండిపోయింది.
చనిపోయిన వారంతా రోజు కూలీలుగా పనిచేస్తున్నవారే కావడం తో ఉపాధికి అంతా ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఆటో కరీంనగర్ నుంచీ జగిత్యాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను జగిత్యాల ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించి వారి కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.మృతుల కుటుంబీకుల రోదనలతో ఆసుపత్రి ప్రాగణం మారు మోగింది.