24.7 C
Hyderabad
March 29, 2024 06: 29 AM
Slider కరీంనగర్

అక్సిడెంట్:కురిక్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం5 గురి మృతి

accsident 5 dead

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీ ఆటో ను ఢీ కొట్టడం తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మృతులు మ్యాక నర్సయ్య, బాబు, మ్యాక బాణయ్య, మ్యాక శంకర్ అని తెలిసింది. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామం విషాదంతో నిండిపోయింది.

చనిపోయిన వారంతా రోజు కూలీలుగా పనిచేస్తున్నవారే కావడం తో ఉపాధికి అంతా ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఆటో కరీంనగర్ నుంచీ జగిత్యాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను జగిత్యాల ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించి వారి కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.మృతుల కుటుంబీకుల రోదనలతో ఆసుపత్రి ప్రాగణం మారు మోగింది.

Related posts

గృహలక్ష్మీ యల్పీజి నూతన కనెక్షన్ పథకం ప్రారంభం

Satyam NEWS

గ్రామాల అభివృద్ధే బీఆర్‌ఎస్‌ సర్కార్‌ లక్ష్యం

Bhavani

వైసీపీ మహిళా నేత నుంచి రూ. 44 లక్షల దొంగ నోట్ల స్వాధీనం

Bhavani

Leave a Comment