కర్నాటక ముఖ్యమంత్రి బి ఎస్ ఎడ్యూరప్ప కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్పష్టంగా చెప్పారు. తనకు కరోనా వచ్చిందని అయితే ప్రస్తుతానికి తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా తాను ఆసుపత్రిలో చేరుతున్నట్లు ఎడ్యూరప్ప చెప్పారు.
డాక్టర్లు కూడా ఈ మేరకు తనకు సలహా ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు అందరూ కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆయన తెలిపారు.