27.7 C
Hyderabad
April 26, 2024 04: 04 AM
Slider కర్నూలు

భారీగా కర్ణాటక మద్యం పాకెట్లు స్వాధీనం

#panchalingalacheckpost

కర్నూలు శివారులోని పంచ లింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద శనివారం ఉదయం భారీ ఎత్తున కర్ణాటక మద్యం దొరికింది. సి ఐ మంజుల, యస్ ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ సేబ్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో ఈ మద్యం అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వైపు నుండి కర్నూలు వెళ్తున్న మహీంద్రా వెరిటో కారు (AP 31 TV 4678)  సిబ్బంది ఆపడానికి ప్రయత్నం చేయగా డ్రైవర్ ఆప కుండా పారిపోయాడు. దాంతో కారును యస్ ఐ తన సిబ్బంది సహాయంతో ఛేజ్ చేసి పట్టుకున్నారు. కారు ను తనిఖీ చేయగా అందులో 13 బాక్సుల్లో కర్ణాటక మద్యం 1248 టెట్రా పాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు 36 వేలు ఉంటుందని సెబ్ సి ఐ తెలిపారు. పట్టుబడిన మద్యం, కారును కర్నూలు సెబ్ పోలీసు స్టేషన్ లో తదుపరి విచారణ నిమిత్తం అప్పగించినట్లు సి ఐ మంజుల తెలిపారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు శాంతరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

మధు, రిపోర్టర్, కర్నూలు

Related posts

అందరి సహకారంతో నెల్లూరు రూరల్ అభివృద్ధి

Bhavani

సైన్స్ ఫెయిర్ లో ప్రతి విద్యార్థి పాల్గొనాలి

Murali Krishna

బలిజ, కాపు, తెలగ కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలి

Satyam NEWS

Leave a Comment