37.2 C
Hyderabad
March 29, 2024 17: 22 PM
Slider ఆధ్యాత్మికం

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

#PadmvatiTemple

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక  బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 8 నుండి 9.30 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను గజ పటాన్ని అవనతం చేసి దేవతలను వారి వారి స్థానాలకు సాగనంపుతారు.

అంతకుముందు రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో  ఊరేగించారు. 

ఈ కార్యక్రమంలో ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్‌,   ఆలయ డెప్యూటీ ఈవో ఝూన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్ర‌మ‌ణ్యం, కంకణభట్టార్ వేంపల్లి శ్రీనివాసులు, సూప‌రింటెండెంట్ కుమార్, ఏవిఎస్వో చిరంజీవి,  ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Related posts

Analysis: కుల రాజకీయాల బీహారం ఎవరికో

Satyam NEWS

మన భారతదేశ సంపద మనమే కాపాడుకోవాలి

Satyam NEWS

రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రావచ్చు

Satyam NEWS

Leave a Comment