తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 8 నుండి 9.30 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను గజ పటాన్ని అవనతం చేసి దేవతలను వారి వారి స్థానాలకు సాగనంపుతారు.
అంతకుముందు రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో ఝూన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్రమణ్యం, కంకణభట్టార్ వేంపల్లి శ్రీనివాసులు, సూపరింటెండెంట్ కుమార్, ఏవిఎస్వో చిరంజీవి, ఆర్జితం ఇన్స్పెక్టర్ రాజేష్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.