కాశ్మీర్ అమర వీరుల దినోత్సవాన్ని భగ్నం చేయడానికి భారత భద్రతాదళాలు పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నాయని హురియత్ కాన్ఫరెన్స్ భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు గిలానీ ఆ పదవి నుంచి తప్పుకున్నారు.
ఈ సమయంలో వివిధ పార్టీల నాయకుల అరెస్టు కాశ్మీర్ లో కల్లోలం రేకెత్తించింది. జమాతే ఇస్లామీ కి చెందిన 12 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
అదే విధంగా ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్సు భాగస్వామ్య పార్టీ అయిన తెహరీక్ ఏ హురియత్ చైర్ పర్సన్ మొహమ్మద్ అష్రాఫ్ సెహారీ ని కూడా భద్రతాదళాలు అరెస్టు చేశాయి. ఇది మానవ హక్కులకు భంగం కలిగించడమేనని హురియత్ కాన్ఫరెన్స్ భాగస్వామ్య పక్షాలు విమర్శిస్తున్నాయి.