37.2 C
Hyderabad
March 29, 2024 20: 02 PM
Slider ప్రపంచం

కాశ్మీర్ అమరవీరుల దినోత్సవాన్ని భగ్నం చేసే యత్నం

#Kashmir Leaders

కాశ్మీర్ అమర వీరుల దినోత్సవాన్ని భగ్నం చేయడానికి భారత భద్రతాదళాలు పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నాయని హురియత్ కాన్ఫరెన్స్ భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు గిలానీ ఆ పదవి నుంచి తప్పుకున్నారు.

ఈ సమయంలో వివిధ పార్టీల నాయకుల అరెస్టు కాశ్మీర్ లో కల్లోలం రేకెత్తించింది. జమాతే ఇస్లామీ కి చెందిన 12 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

అదే విధంగా ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్సు భాగస్వామ్య పార్టీ అయిన తెహరీక్ ఏ హురియత్ చైర్ పర్సన్ మొహమ్మద్ అష్రాఫ్ సెహారీ ని కూడా భద్రతాదళాలు అరెస్టు చేశాయి. ఇది మానవ హక్కులకు భంగం కలిగించడమేనని హురియత్ కాన్ఫరెన్స్ భాగస్వామ్య పక్షాలు విమర్శిస్తున్నాయి.

Related posts

నిరుద్యోగులను నిలువునా ముంచిన టీఆర్ఎస్ పార్టీ

Satyam NEWS

టిక్ టాక్ యాప్ పై బ్యాన్ దిశగా అమెరికా?

Satyam NEWS

మంచి మందులు రాయితీపై ఇవ్వాల్సిన అవసరం ఉంది

Satyam NEWS

Leave a Comment