25.7 C
Hyderabad
May 24, 2025 08: 36 AM
Slider ప్రపంచం

కాశ్మీర్ అమరవీరుల దినోత్సవాన్ని భగ్నం చేసే యత్నం

#Kashmir Leaders

కాశ్మీర్ అమర వీరుల దినోత్సవాన్ని భగ్నం చేయడానికి భారత భద్రతాదళాలు పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నాయని హురియత్ కాన్ఫరెన్స్ భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు గిలానీ ఆ పదవి నుంచి తప్పుకున్నారు.

ఈ సమయంలో వివిధ పార్టీల నాయకుల అరెస్టు కాశ్మీర్ లో కల్లోలం రేకెత్తించింది. జమాతే ఇస్లామీ కి చెందిన 12 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

అదే విధంగా ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్సు భాగస్వామ్య పార్టీ అయిన తెహరీక్ ఏ హురియత్ చైర్ పర్సన్ మొహమ్మద్ అష్రాఫ్ సెహారీ ని కూడా భద్రతాదళాలు అరెస్టు చేశాయి. ఇది మానవ హక్కులకు భంగం కలిగించడమేనని హురియత్ కాన్ఫరెన్స్ భాగస్వామ్య పక్షాలు విమర్శిస్తున్నాయి.

Related posts

శ్రీశైల మహా క్షేత్రంలో ఏప్రిల్19 న కుంభోత్సవం

Satyam NEWS

తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

Satyam NEWS

బోధనం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!