33.2 C
Hyderabad
April 26, 2024 00: 34 AM
Slider శ్రీకాకుళం

కస్తూరిబా కళాశాలల సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం

#kasuribacollege

ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కస్తూరిబా ప్రభుత్వ జూనియర్ కళాశాలల సిబ్బంది సమస్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని బిజెపి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు తెలిపారు. బిజెపి నిర్వహించిన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక సదస్సులో పాల్గొనటానికి నగరానికి వచ్చిన జివిఎల్ ను, ఎం.ఎల్.సి మాధవ్ ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన కస్తూరిబా జూనియర్ కళాశాలల అధ్యాపకులు కలసి తమ సమస్యలను పరిష్కరించాలని ఇరువురి నేతలకు వినతి పత్రాలు అందించారు.

ఎం.ఎ. బి.ఇ.డిలు, ఎం.ఎస్.సి బి.ఇ.డిలు చేసి జూనియర్ లెక్చరర్లుగా పనిచేస్తున్న తమకు నెలకు 12000 వేల రూపాయిల గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. అలాగే తాము ఉద్యోగం చేరిన తొలి రోజున తమ విధులు పార్టు టైంగా ఉంటాయని చెప్పి ఇప్పుడు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించాలని అనధికార ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వారన్నారు. ఎస్.ఎస్.ఎ అధికారులు పని విషయానికి వచ్చే సరికి ఇరవై నాలుగు గంటలు కళాశాలకు అంకితం కావాలని ఎస్.ఒ.లు తమపై పని ఒత్తిడి పెంచారని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నత విద్యార్హతలు కలిగిన తామకు దిగువ స్థాయి సిబ్బందిలో సగం జీతం కూడా అందటం లేదని వాపోయారు. తమతో పాటే విధుల్లో చేరిన తెలంగాణాలోని కస్తూరిబా కళాశాల అధ్యాపకులకు 23 వేల రూపాయిలు జీతం అందుకుంటున్నారని జివిఎల్ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు 37,100, ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు  47,000 రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

ఒకే పని ఒకే విధంగా చేస్తున్నప్పటికీ కలలో తేడా చూపించడం చాలా బాధాకరం అని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ కళాశాల అధ్యాపకులకు, కేజీబీవీ లో పనిచేస్తున్న అధ్యాపకులకు ఒకే విద్యార్హతలు ఉన్నాయని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన కేజీబీవీ ఇంటర్మీడిట్ కళాశాలలో నేటికీ సైన్స్ ల్యాబ్ లో లేవని తెలిపారు. జి.వి.ఎల్.నరసింహారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేజీబీవీ లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని, సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Related posts

కోవిడ్ నియంత్రణకు మైహోం పరిశ్రమ చేయూత

Satyam NEWS

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

Bhavani

ప్రొఫెసర్ నాగేశ్వర్, బీజేపీ రాంచందర్ రావు పట్టభద్రులను పట్టించుకోలేదు

Satyam NEWS

Leave a Comment