తమిళనాడు రాష్ట్రం మధురై వాస్తవ్యులు డా. కే. జీ. శ్రీనివాసన్, కవిత తయారు చేయించిన 1 KG 300 గ్రా బంగారు ఆభరణాలను తిరుచనూరు పద్మావతీ అమ్మవారికి బహుకరించారు. చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు ఆర్ కే రోజా ఈ కాసుల మాల ను నేడు దేవస్థానానికి అందచేశారు. తమిళనాడు రాష్ట్రం మధురై లో డాక్టర్ వృత్తి లో వున్నడా. కే జి శ్రీనివాసన్, కవిత మధురై లోని ప్రముఖ బంగారు ఆభరణాల షో రూమ్ శ్రీ జయప్రభ జ్యువెలర్స్ లో వీటిని తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో కే. జీ. శ్రీనివాసన్, కవిత వారి ప్రతినిధులు కార్తీక్, జయప్రభ జ్యువెలర్స్ అధినేత ధనశేఖర్, పాండియన్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ AEO, ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి బంగారు కాసుల మాలని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి బహుమానాన్ని స్వీకరించారు.