35.2 C
Hyderabad
April 20, 2024 16: 27 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ టిడిపి ఉపాధ్యక్షురాలుగా ప్రసూన

#KatragaddaPrasuna

తెలంగాణ టిడిపి ఉపాధ్యక్షురాలుగా మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన నియమితులయ్యారు. గతంలో సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన కాట్రగడ్డ ప్రసూన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

బడుగు బలహీన వర్గాల పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నారని, సమాజాన్ని నూతన ఒరవడిలో ముందుకు తీసుకువెళ్లేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్నారని కాట్రగడ్డ ప్రసూన తెలిపారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆధ్వర్యంలో పేద ప్రజల సేవకు పునరంకితమౌతానని ఆమె తెలిపారు.

Related posts

టాస్క్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్ బిట్టూ మృతి

Satyam NEWS

కొయ్యలగూడెం వద్ద ఆర్ టిసి బస్సు, లారీ ఢీ

Bhavani

అశోకుని అంతటి ధీశాలి శ్రీకృష్ణదేవరాయలు

Bhavani

Leave a Comment