నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో 54 ఏళ్ల మహిళ పై అత్యాచారం జరిగిన దారుణమైన ఘటన ను తెలంగాణ తెలుగు దేశం ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన తీవ్రంగా ఖండించారు.
మహిళలు కు జరుగుతున్న దారుణాలు అరికట్టలేని హోం మంత్రి, మహిళ కమిషన్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
వయస్సు తో సంబంధం లేకుండా మానవ మృగాలు ఆడవారు అయితే చాలు రేప్ లు, హత్యలు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠినమైన చట్టాలు తేవాలని కాట్రగడ్డ ప్రసూన డిమాండ్ చేశారు.