దీపాలు రెపరెపలాడేవేళ
నిన్న చెదిరిన కల ఒకటి నడిచొచ్చింది.
ఒకానొక ఆత్మకథలా వెంటాడుతున్నది.
అశాంతి కేకల చితిమంటల మృత్యువది
అవి సహజ మరణాలు కానప్పుడు
ఆత్మలూ వెంటాడుతాయి.
అన్యాయమూ వెంటాడుతుంది !
కాలప్రభంజనం భళ్ళునతెల్లారకముందే
అమ్మచెంగటన పెరిగిన ప్రాణి,నాన్న దగ్గరి గమనింపుల బ్రతుకూ జీవచ్ఛమై,
అన్నా,అక్కా ,అత్త ,చిన్నాన్న, పెద్దమ్మ,
అత్తామామల పిలుపుల రూపులన్నీ
టపటప రాలినపడిన దృశ్యాలై
పొగలా చుట్టుకున్నవి.
గుండెగూటానికి ప్రేమదారాలు తగిలించిన జంటలో, పంటలో చావు మంటలకుఆహుతయినపుడు, సంతసానికి ఆవైపు , సంతసానికి ఈ వైపు మరచిపోలేని ప్రశ్నమౌనంగాఉన్నప్పుడు
చిటికెడు ప్రాపంపంచిక సుఖాలు , ప్రపంచానికందించే సౌకర్యాలే ప్రమాదాలైనప్పుడు విషం …. విషం …
వాయువై..వాహికై….. ప్రాణాలు హరించిన విషయం వెనుక దాగిన దాష్టీకం , ప్రాణదీపాలార్పిన చిట్టాల్లోనే
రాస్తారు. చిత్తాల్లోంచి తీయలేరని
ఏ శాఖలు లేని విశాఖసముద్రుడు ఇప్పుడు గుంభనంగా రోదిస్తున్నాడు
కొండపల్లి నీహారిణి