సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు పరామర్శించారు.
హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన రాజా ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు.
దాంతో ఆయనను కోఠి లోని కామినేని హాస్పిటల్ లో చేర్పించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్కడకు వెళ్లి డి. రాజా ను పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవిత తో బాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఉన్నారు.