కరీంనగర్ నుంచి మంత్రి అయిన మన కమలాకరన్నకోరికల లిస్ట్ చాంతాడంత పెద్దగానే ఉంది.తనకు మంత్రి పదవిచ్చిన కేసీఆర్ కుటుంబం ఎంత చల్లగా ఉండాలనో అని అయన చెబుతుంటే అబ్బో అనిపిచ్చింది జనాలకు .తెలంగాణ భవన్లో మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల భేటీకి లో గంగుల ఎం కోరుకుంటున్నారో ఓసారి మనం చూద్దాం.దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలనట గదె తీరుగా తెలంగాణాకు కేటీఆర్ సీఎం కావాలనట, అప్పు డే దేశం బాగుపడతదట.
అట్లనే తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ పేరు తెచ్చుకున్నారని,స్థానిక సంస్థల్లో భారీ విజయానికి కేటీఆర్ పనితీరే కారణమని రాబోయే 40 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని , కెసిఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ దూసుకుపోతుంటే ,అదే స్థాయిలో తనయుడిగా కెటిఆర్ పార్టీని బలోపేతం చేస్తున్నరని వాళ్ళను పొగిడి పొగిడి ఆకాశాన్నికి ఎత్తేసిండు మన కమలాకరన్న. గట్లనే పోటీ పార్టీ వాళ్ళను కూడా ఒక దుమ్ము దులిపిండు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కరీంనగర్లో గల్లంతైందని ,టీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్, బీజేపీ కలిశాయని అన్నాడు.
అయన .నిన్నటి దాకా కొందరు మంత్రులు కేటీఆర్ సీఎం కావలి అని మాత్రమే కోరగా వాళ్లను మించి కమలాకర్ సారూ కెసిఆర్ ప్రధాని కావాలని కోరడం చూసి ఔరా అన్న కు వాళ్ళంటే ఎంత ప్రేమా అని అబ్బురపడుతున్నారట కార్యకర్తలు,నాయకులూ ప్రజలు.గిట్ల పొగిడితే కమలాకరన్న కూడా మంత్రిగా నాలుగేళ్లు ఉంటడని వాళ్ళు గుసగుస లాడుతున్నారట .