శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో గత ఏడాది 2019/2020 విద్యాసంవత్సరంలో కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో 20 మంది అధ్యాపకులు జీవితాలు త్రిశంకు స్వర్గంలో పడ్డారు.
గత సంవత్సరంలో ఈ అధ్యాపకులు ఒప్పంద అధ్యాపకుల్లా విద్యార్థులకు పాఠాలను బోధించడం, రాత్రి 24 గంటలు కళాశాలలో ఉండి విద్యార్థులకు అదనపు తరగతులు బోధించడం, ప్రాక్టికల్స్ నిర్వహించడం, విద్యార్థులకు పరీక్షలు పెట్టి వారి మేధస్సును పెంచడం చేస్తున్నారు.
అంతే కాకుండా ప్రభుత్వం ప్రధాన పరీక్షల్లో పరిశీలన పర్యవేక్షించడం, విద్యార్థుల యొక్క చివరి పరీక్షల్లో మూల్యాంకనం చేయడం, ఎన్నికలు వీధులను, నిర్వహించడం, బడి మానేసిన విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించడం అనేక కార్యక్రమాలను నిర్వహించిన వీరిని విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించారు.
వీరిని ఉద్యోగస్తులు గా గుర్తించి తొలగించడం చాలా బాధాకరం విషయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రధాన కార్యదర్శి కాంతారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.