36.2 C
Hyderabad
April 24, 2024 19: 43 PM
Slider వరంగల్

ములుగు జిల్లా లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

#MuluguZPChairmen

జనహృదయ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు నేడు ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మొక్కలను నాటారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేకు కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మండల పరిషత్తు కార్యాలయంలో జడ్పీటీసీ సకినాల భవాని,ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ మొక్కలు నాటారు. ములుగు మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ములుగు చౌరస్తాలో కేక్ కట్ చేశారు.

కేసీఆర్ జన్మదిన వేడుకలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు,పార్టీ శ్రేణులు అందరూ కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపుర్ జడ్పీటీసీ రుద్రమదేవి అశోక్, ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య,

ఎమ్మెల్సీ ఎన్నిక నియోజకవర్గ కో ఆడినేటర్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా కోప్షన్ రియాజ్ మీర్జా, ఎంపీటీసీలు గొర్రె సమ్మయ్య, భాగ్యలక్ష్మి రమేష్, ఆత్మ చైర్మన్ బైకని ఓదేలు, జలగం రామ్మోహన్ రావు, రాష్ట్ర యువజన నాయకులు ఎర్వ వెంకటాద్రి, మైనార్టీ నాయకులు తాహిర్ పాషా,

రైతు బంధు మండల అధ్యక్షులు కె.కుటుంబరావు, వెంకటాపుర్ మండల అధ్యక్షులు కూరేళ్ల రమాచారి, సీనియర్ నాయకులు సత్యనారాయణ,దళిత సమితి అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య,మండల ఉపాధ్యక్షుడు శీలం మధు,మండల యూత్ అధ్యక్షులు నాజర్ ఖాన్,బీసీ సెల్ మండల అధ్యక్షులు రవి రామన్,పట్టణ ములుగు అధ్యక్షులు మెరుగు సంతోష్,మల్లికార్జున్,పోలెం శ్రవణ్,వేల్పుల రాజబాబు,ముఖ్య నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

Protest on police: నేరం చేసిన వైసీపీ నేతపై చర్య తీసుకోరా?

Satyam NEWS

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

Satyam NEWS

అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబురాలు

Satyam NEWS

Leave a Comment