మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచి కొనసాగుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజలు అభిప్రాయాలను వెలిబుచ్చారు. అంతే కాకుండా సర్వే రిపోర్ట్ లను పరిశీలించిన మీదట సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.