37.2 C
Hyderabad
March 29, 2024 18: 06 PM
Slider హైదరాబాద్

తెలంగాణ సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి

#RamakrishnaNagar

హైదరాబాద్ లోని కూకట్ పల్లి వివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ నగర్ లో వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు విచ్చేసి కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా రోజా దేవి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ మహిళలకు ఎంతో గౌరవం ఇస్తుందని తెలిపారు. జిహెచ్ఎంసి ఎలక్షన్ లో డెబ్భై ఐదు సీట్లు మహిళా రిజర్వేషన్ ఉంటే టిఆర్ఎస్ పార్టీ దాదాపు 83 సీట్లు మహిళలకు ఇచ్చిందని అన్నారు.

మేయర్ మహిళకు రిజర్వ్ అయినప్పటికీ డిప్యూటీ మేయర్ కూడా మహిళకు ఇచ్చి మహిళా పక్షపాతి  కేసీఆర్ అని నిరూపించుకున్నారని రోజా దేవి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని ఆమె అన్నారు.

అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడాలని ఆమె కోరారు. మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వీలైనంత త్వరగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, నాయకులు మోజెస్, మధు, సాలయ్య,  మిట్టు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాధాబాయి, లక్ష్మి, కవిత, స్వరూప, సంధ్య, లక్ష్మి, రాజేశ్వరి, కృపారాణి, దేవి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్నికల కోడ్ అమలులో ఉందో లేదో చెప్పగలరా?

Satyam NEWS

GD నెల్లూరు నియోజకవర్గంలో YCPకి వర్గపోరు

Satyam NEWS

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా ‘అమిగోస్’.. ఫిబ్రవరి 10న గ్రాండ్ రిలీజ్

Satyam NEWS

Leave a Comment