గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు
హుజూరాబాద్ లో తెరాస హవా కొనసాగుతోంది. ప్రతీ రోజు నియోజకవ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తెరాసకే తమ మద్దతని స్పష్టం చేస్తున్నారు. .తెరాస చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేతులను బలపరుస్తామంటూ ముందుకు వస్తున్నారు.
ఇవాళ వీణవంక మండలం దేశాయి పల్లి గ్రామానికి చెందిన గౌడ, బుడగజంగాలు, మున్నూరు కాపు కుల సంఘాల వారు , ఉప సర్పంచ్ నల్ల సత్యనారాయణ రెడ్డి ఆద్వర్యంలో రెడ్డి సంఘం వారు తెరాస లో చేరారు.
నర్సింగాపూర్ గ్రామం నుండి పద్శశాలీ సంఘం నేతలు తెరాసలో చేరారు. ఈ రెండు గ్రామాల నుంచి దాదాపు 150 మంది తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను బలపరుద్దామని పిలుపునిచ్చారు. కులవృత్తులను బలో పేతంచేసేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, గొల్ల కురుమలకు గొర్రెలు మత్స్యకారులలకు చేప పిల్లల ఉచితంగా పంపిణీ చేశారని ఆయన గుర్తు చేశారు.
రైతుకు రైతు బంధు, రైతు బీమా, సకాలంలో విత్తనాలు, ఎరువులు వంటివి పంపిణీ చేసి రైతును రాజుగా మార్చారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ దూరదృష్టి, ప్రణాళిక వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డ్ సమయంలో పూర్తి చేసి రైతన్నకు సాగు నీటికొరత లేకుండా చేశారని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం తొలి ఫలితం అందుకున్న నియోజకవర్గం హుజూరాబాద్ అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం లో దేశాయిపల్లి, నర్సింగాపూర్ నేతలు నల్ల మహేందర్ రెడ్డి, ఉయ్యాల చంద్రమౌళి, సాంబయ్య, తిరుపతి, దేవేందర్, సదానందం తదితరులు పాల్గొన్నారు.