భారత రాజ్యాంగం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని నాగర్ కర్నూల్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ అన్నారు. అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కేసీఆర్ పై రాజద్రోహం కేసు పెట్టాలని కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఏ రాజ్యాంగం ద్వారా అయితే తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందో అదే రాజ్యాంగాన్ని మార్చి భారత దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అనడం దేశ ద్రోహం అని కేసీఆర్ ను దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కోశాధికారి కారంగి బ్రహ్మయ్య కొల్లాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు మునిస్వామి,కొల్లాపూర్ మండల కన్వీనర్ లు కాటం శివశంకర్ ,పరుశురాం,దాసు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి దర్గాస్వామి, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
previous post