హైదరాబాద్ లోని ఉస్మానియా దవాఖానా వర్షం నీటితో నిండిపోవడం చూస్తుంటే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందనే విషయం వెల్లడి అవుతూందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంటే వైద్య సౌకర్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఉదాహరణ చెప్పుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా వైద్య శాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేకపోతున్నదని ఇది దారుణమైన విషయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఫెయిల్ చేశారని ఆయన అన్నారు.