34.2 C
Hyderabad
April 19, 2024 20: 46 PM
Slider కరీంనగర్

ధర్మాన్ని కాపాడే నిజమైన హిందువు కెసిఆర్

#Minister Gangula Kamalakar

కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ లు రాముడిని ఎన్నికల కోసం వాడుకుంటున్నారని, నిజంగా ధర్మాన్ని కాపాడే వారే అయితే కొండగట్టు ఆలయ అభివృద్ధికి వంద కోట్ల నిధులు తేవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు కొండగట్టు పర్యటనకు వస్తున్న సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మీడియా తో మాట్లాడుతూ…ఉత్తర తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అయిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అయినందున ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి వందల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న కెసిఆర్ ఏ అసలైన హిందూ ధర్మాన్ని కాపాడేది అని అన్నారు.

సంజయ్ అరవింద్ లు రాముడి పేరు చెప్పి ఎంపిలు అయ్యారని, ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఏ ఒక్క దేవాలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తేలేదని, నిజంగా హిందువులు అయితే మేము ఇచ్చే నిధులకు తోడుగా100 కోట్లు తేవాలని అప్పుడే నిజమైన హిందువులుగా చూస్తాం అని అన్నారు.

గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ మరింత తగ్గిందని బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఎన్నికల కోసం దేవుళ్ళను వాడుకుంటున్న బీజేపీ నాయకులను రానున్న ఎన్నికల్లో నిలదీస్తాం అన్నారు.

Related posts

25న వైభవంగా మహాంకాళి బోనాల జాతర

Satyam NEWS

“ఇప్పుడు కాక ఇంకెప్పుడు”  టీజర్ విడుదల!!

Satyam NEWS

ఆంధ్రుల ఆత్మ గౌరవ నినాదంతో ముందడుగు వేద్దాం

Satyam NEWS

Leave a Comment