నిత్యం రైతుల కోసం పాటుపడే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి, పాలకీడు మండల సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సైదిరెడ్డి మాట్లాడుతూ దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు కేసీఆర్ అన్నారు.
దేశం మొత్తం కరోనా విలయతాండవం చేస్తున్నదని, రాష్ట్రంలో కూడా దాని ప్రభావం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
సామాన్య రైతులకు అందుబాటులో ఉండే విధంగా నూతన రెవిన్యూ చట్టం ఉండబోతున్నదని, రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ పెద్దపీట వేస్తున్నదని అన్నారు.
నియోజకవర్గంలో DMFT, SDF నిధుల నుండి అభివృద్ధి పనులను జరుగుతున్నాయని అన్నారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సమావేశంలో జడ్పీటీసీ పోరెడ్డి శైలజారవిందర్ రెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, గరిడేపల్లి, పాలకీడు మండలాల పార్టీ అధ్యక్షులు జోగు అరవింద రెడ్డి, మలిమంటి దుర్గారావు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.