34.2 C
Hyderabad
April 19, 2024 21: 19 PM
Slider ముఖ్యంశాలు

జంట హత్యల కేసును సిబిఐకి అప్పగించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

#KomatireddyVenkatreddy

పెద్దపల్లి జిల్లాలో  జరిగిన హై కోర్ట్ అడ్వకేట్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

నకిరేకల్ నియోజకవర్గం నార్కెట్ పల్లి గ్రామ శివారులో గల వివేర హోటల్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు

దంపతుల హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన  తెలిపారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎస్ పార్టీ అరాచకాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని అన్నారు.

ప్రశ్నించే గొంతులను అడ్డు తొలగించుకోవడానికి టిఆర్ఎస్ హత్యలు చేస్తుందని అన్నారు.

ఒక మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉదయం కెసిఆర్ జన్మదిన కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం హత్యలు చేయడం దారుణమైన విషయమని అన్నారు.

ఈ హత్యల వెనుక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో రాష్ట్రంలో  అన్ని ప్రాంతాలలో  పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసు కుంటామని అన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన అంతం అయ్యే రోజులు దగ్గరపడ్డాయని కోమటిరెడ్డి అన్నారు.

Related posts

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

Bhavani

ఉన్నదంతా ఊడ్చేశారు… జీతాలు ఈ నెల కూడా లేటే

Satyam NEWS

అబద్దాలు చెప్పిన మంత్రిని బర్తరఫ్ చేయాలి

Sub Editor 2

Leave a Comment