33.2 C
Hyderabad
March 22, 2023 21: 08 PM
Slider తెలంగాణ

అప్పటిలో పోలవరం ప్రాజెక్టు వద్దని చెప్పాం

mallu kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టు వద్దని ఆనాడు వ్యతిరేకించామని ఆయన తెలిపారు. ఇందిరా సాగర్ పేరుతో పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని కూడా  ఆరోపించారు. ఈ విషయం రికార్డుల్లో ఉందని, కావాలంటే చూసుకోవాలని విపక్షాలకు సూచించారు. కాగా, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కేసీఆర్, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం సాగింది. దివాలా తీసిన ప్రభుత్వం తీరులో బడ్జెట్ ఉందని భట్టి విమర్శించగా, ఓవైపు ప్రాజెక్టులు పూర్తవుతున్నా చూడలేని కళ్లు ఉన్న కబోదుల్లా తయారయ్యారంటూ కేసీఆర్ విపక్ష నేతపై మండిపడ్డారు.

Related posts

రాజకీయ నాయకుల రాకతో సందడిగా వివాహ రిసెప్షన్

Satyam NEWS

గుంటూరులో రెమిడిస్వేర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ దందా

Satyam NEWS

సవాల్ కు సై…చర్చకు సిద్ధమా?

Bhavani

Leave a Comment

error: Content is protected !!