ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని నేడు సీఎం కేసీఆర్ పరిశీలించారు. వసంత్ విహార్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతున్నది. ఈ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, దివకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవించంద్ర, ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి వివరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసుకున్నారు.
previous post