సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్లచెరువు మండల కేంద్రంలో గ్రామంలోని నూతనంగా నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం (స్మశానం) ప్రహరీ గోడ, ఆర్చి నిర్మాణానికి కీర్తి (సువర్ణ) సిమెంట్స్ వారు 25 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు.
ఈ నిర్మాణం పనులను స్థానిక సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిమెంటు పరిశ్రమకు చెందిన అధికారులు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ రమేష్ బాబు, స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సభ్యులు ఇరిగెల పోల్ రెడ్డి, గుండా మోహన్ రావు, కర్నాటి లక్ష్మీ నరసింహా రెడ్డి, కటకం కేశవరావు పాల్గొన్నారు.
ఇంకా, గ్రామ పెద్దలు కొంకపాక వెంకటేశ్వర శర్మ, రాధాకృష్ణ మూర్తి శర్మ, చాగమ రెడ్డి , గోవిందరెడ్డి, సోమిరెడ్డి ,వెంకట్ రెడ్డి, పసుపులేటి నాగేశ్వరరావు, సాతులూరి మాధవరావు, స్మశాన వాటిక స్థలం విరాళ దాతలు తదితరులు పాల్గొన్నారు.