శబరిమలలో భక్తుల సందడి మొదలైంది. కేరళ సహా దేశ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. అయితే, కేరళతో పాటు.. పొరుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో శబరిమల అయ్యప్ప దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
భారీ వర్షాల కారణంగా కేరళలోని పంబా వంటి ప్రధాన నదుల్లో నీటిమట్టం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆలయం చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే, శనివారం ఒక్క రోజే అయ్యప్ప దర్శనానికి 20 వేల మంది భక్తులు టికెట్లను బుక్ చేసుకున్నట్లు సమాచారం.