27.7 C
Hyderabad
April 25, 2024 07: 33 AM
Slider ఆంధ్రప్రదేశ్

గ్రీన్ లైట్: కీసర టోల్ ప్లాజా వద్ద పటిష్టమైన చర్యలు

keesara toll

సంక్రాంతి పురస్కరించుకొని తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి భారీ వాహనాలు రానున్న నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా నందిగామ డిఎస్పీ జి వి. రమణ మూర్తి, నందిగామ రూరల్ సీఐ సతీష్ ఆధ్వర్యంలో కీసర టోల్ ప్లాజా వద్ద  ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేశారు. అదనపు  సిబ్బందిని ఏర్పాటు చేశారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలోని తమ సొంత గ్రామాలకు పండగకు వస్తారనే ఉద్దేశ్యంతో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే కార్లు, బస్సులతో రద్దీ ఎక్కువగా ఉండి ట్రాఫిక్కు అంతరాయం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ప్రతి క్యూలైన్ వద్ద టోల్ ఫ్లాజా సిబ్బందిని కూడా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ అయిపోయిన తరువాత విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, పైన తెలిపిన విధంగా టోల్ ప్లాజా వారు ప్రత్యేక కౌంటర్లు, సిబ్బందిని పెంచుకొని పోలీసువారికి సహకరించాలని నందిగామ డి.ఎస్.పి జి వి రమణ మూర్తి తెలిపారు.

Related posts

పిచ్చి సినిమాలు తీయడం మానుకో రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

కాశ్మీర్‌‌‌‌ ప్రశాంతం శ్రీనగర్‌‌‌‌లో మాత్రం ఆందోళన

Satyam NEWS

కొల్లాపూర్ ఆసుపత్రిలో కరోనా రాపిడ్ టెస్టులు

Satyam NEWS

Leave a Comment