తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభువుగా వెలసిన ముందు పురుషరూపం వెనకాల స్త్రీ రూపం కలిగిన శ్రీ జగన్మోహినీ కేశవ గోపాల స్వామి శ్రావణ నక్షత్ర మాస కళ్యాణం అత్యంత వైభవంగా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు వందల మంది భార్యాభర్తలు ఇరువురు దంపతులు పాల్గొని పూజలు చేయించుకున్నారు. మరల తిరిగి వచ్చేనెల ఒకటో తారీఖున పుష్యమాసం మంగళవారం నాడు జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కల్యాణంలో భక్తుల పేరు ట వివిధ వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, ఆరోగ్య ,వ్యాపారం, మొదలగు కోరికల కొరకు స్వామివారి కళ్యాణం లో వారి పేరున పూజలు చేయించుకునేవారు. 08855-250477, 250231 నంబర్లకు సంప్రదించి online ద్వారా రుసుము రూ.500/- లు చెల్లించి పూజనందు పాల్గొనవచ్చును. ప్రసాదం పోస్టు ద్వారా పంపబడును అని ఆలయ కార్యనిర్వహణాధికారి బి కృష్ణ చైతన్య తెలిపారు.
previous post