రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్ తో ఉద్యమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నేడు జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను గృహనిర్భంధం చేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది.
పటమట సిఐ పర్యవేక్షణలో నాని ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఆయనను అడుగు బయటకు పెట్టనివ్వలేదు. రాజధాని అమరావతి నిర్మాణంలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు గద్దె రామ్మోహన్ చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలియచేయడానికి వెళుతున్న కేశినేని నానిని కట్టడి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వ నిరంకుశ వైఖరి అవలంబించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. SI తో సహా 10 మంది పోలీసులతో నాని గృహాన్ని చుట్టుముట్టి నిర్బంధించారు.