అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ అభివృద్ది పై జరిగిన ఈ సమావేశంలో ఖమ్మం అభివృద్ధి పై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం మంత్రి పువ్వాడ అజయ్ కృషి తో నేడు సుందరనగరం గా మారింది. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలె. అందరు కలిసి ఖమ్మం టూరు వెల్లండి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రావాలని నిజామా బాద్ అధికారులను, ఎమ్మెల్యేలను సిఎం కేసీఆర్ ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.