గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ నటి ఖుష్బూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో రోజా వనం ఫౌండర్ రోజా, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్న రోజా ని , ఎంపీ సంతోష్ ని అభినందిస్తున్నట్లు చెప్పారు.
మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి.. ఆహారం, దుస్తులు, నివాసం. వీటితో పాటు ప్రాణ వాయువు కూడా ఎంతో అవసరం. ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతు న్నాయి. వీటిని మనం ఎంత విరివిగా పెంచితే అంత మంచిది అందుకోసమే అందరూ మొక్కలు నాటాలని అన్నారు.