విజయవాడ కు చెందిన నాలుగేళ్ళ హేమంత్ తాను సైకిల్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు 971 రూపాయిలు కరోనా పై పోరాటం చేస్తున్న సీఎం జగన్ కు ఇవ్వాలని కోరడం తో తల్లిదండ్రులు మంత్రి పేర్ని నాని వద్దకు తీసుకువచ్చారు. తాడేపల్లి వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంకు వచ్చి మంత్రి కి ఆ మొత్తాన్ని అందించారు.
సీఎం సహాయ నిధికి పంపించాలని మంత్రిని కోరిన హేమంత్ తనకి సీఎం జగన్ అంటే చాలా ఇష్టం అని అందుకే దాచుకున్న డబ్బులు ఇస్తున్నానని మంత్రికి హేమంత్ చెప్పాడు. చిన్న వయస్సు లో ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న హేమంత్ ని అభినందించిన మంత్రి పేర్ని నాని సీఎం సహాయ నిధికి అందిస్తామని తెలిపారు.
అంతే కాకుండా హేమంత్ కొనుక్కోవాలనుకున్న సైకిల్ ని తాను కొనిస్తానని బాలుడికి హామీ ఇచ్చారు మంత్రి పేర్ని నాని.