నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్లో బాలుని కిడ్నాప్ యత్నం కల కలం రేకెత్తించింది. ఈ వ్యవహారంలో పోలీసులు అలసత్వం వహించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ నాయకులు రంగ ప్రవేశంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కిడ్నాప్ కు పాల్పడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలు సూత్రధారులు శ్రీకాంత్ రెడ్డి, జీవన్, సుధాకర్ రెడ్డి అని తెలిసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు అయితే వారిని ఇంతవరకూ పోలీస్ విచారణకు పిలవకపోవడం పలు అనుమానాలు తావిస్తున్నది.
పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు, బాలుని తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్నారు. ఇకనైనా అసలు సూత్రదారులేవరో వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి.