కేంద్రం ప్రవేశ పెట్టిన 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉప సంహరించుకోవాలని కిసాన్ కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరైన ఆయన ఈ డిమాండ్ చేశారు.
అనంతరం వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు కిసాన్ కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది.
అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేసే కుట్రను మానుకోవాలని రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం, మంగపేట మండల అధ్యక్షుడు చౌళం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.