35.2 C
Hyderabad
April 24, 2024 14: 16 PM
Slider ముఖ్యంశాలు

వార్నింగ్: రాష్ట్ర ప్రభుత్వం అధికారులను బెదిరిస్తే ఊరుకోం

g kishan reddy

అధికారులపై బెదిరింపు చర్యలకు పాల్పడితే కేంద్రం చూస్తూ ఊరుకోదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ లేఖ పై రాష్ట్ర సీఎస్ నీలం సహానీ తో హోంశాఖ కార్యదర్శి మాట్లాడారని మంత్రి వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ లేఖపై రాష్ట్ర సీఎస్ తో మాట్లాడి రక్షణ ఇవ్వాలని చెప్పామని ఆయన అన్నారు.

ఏ అధికారులను అయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల వారు బెదిరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. వీలైతే ఇవాళ లిఖితపూర్వక ఆదేశాలు రాష్ట్రానికి ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రమేష్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో రక్షణలోనే ఉన్నారని, ఏపీ వెళ్తే పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా సీఎస్ కు చెప్పామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Related posts

రాజ్యాంగం జోలికి వస్తే తగిన బుద్ధి చెబుతాం: ఎమ్మార్పీఎస్

Satyam NEWS

ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి

Satyam NEWS

జగన్ ముఖ్య కార్యదర్శిపై అమిష్ షాకు ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment