తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను దాదాపుగా ఖరారు చేసింది. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు ఒక స్థానాన్ని ఇవ్వబోతున్నారు. అదే విధంగా రెండో స్థానం నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఖరారైనట్లు తెలిసింది.
వారిద్దరిని అధికారికంగా ప్రకటించిన అనంతరం నామినేషన్లు దాఖలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మేరకు రెండు స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుంది.