భారతదేశానికి పేరు తెచ్చిన ఇండియన్ హెర్క్యులెస్, మల్లయోధుడు, మల్లమార్తాండ, మల్లరాజ,కలియుగ భీముడు, కోడి రామ్మూర్తి నాయుడు స్మారక దినోత్సవం శ్రీకాకుళంలో ఘనంగా జరిగింది. స్థానిక క్రీడా ప్రాంగణంలోని కోడి రామ్మూర్తి నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు రొక్కం సూర్య ప్రకాష్ రావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఆయన పేరుమీద ఉన్న ఒకే ఒక్క క్రీడాప్రాంగణం అయిన కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణం అభివృద్ధిని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగేళ్ల క్రితం ఈ క్రీడా ప్రాంగణం అభివృద్ధి చేస్తామని చెప్పి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఎప్పటికీ ఈ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అలాగే ఉందని అన్నారు.
ఇప్పటికైనా వివిధ రాజకీయ పక్షాలు, ప్రభుత్వ అధికారులు ఈ క్రీడా మైదానాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు డా. గుండ బాల మోహన్, చల్ల జగదీష్, పుప్పాల శంకర్, తదితరులు పాల్గొన్నారు.