38.2 C
Hyderabad
April 25, 2024 11: 53 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

#KoilalwarTirumanjanam

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.

ఈ సంద‌ర్భంగా టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ఆల‌యం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తి ఏడాదీ సంవ‌త్స‌రానికి నాలుగు సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

ఆలయంలో ఉదయం 6 నుండి 12 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు.

శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు స‌భ్యులు  శేఖ‌ర్‌రెడ్డి, అనంత‌, ఆలయ డెప్యూటీ ఈవో  హరీంద్రనాథ్‌, పేష్కార్  జ‌గ‌న్మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా ఉక్కుమనిషి సర్దార్ పటేల్ జయంతి

Satyam NEWS

నిర్విరామంగా పని చేస్తున్న హైదరాబాద్ కోవిడ్ కాల్ సెంటర్

Satyam NEWS

సిర్పూర్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment