30.7 C
Hyderabad
April 19, 2024 10: 30 AM
Slider ముఖ్యంశాలు

డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌

#kolagatla

ఏపీరాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అసెంబ్లీలో  స్పీకర్ తమ్మినేని సీతారాం ….స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు.  డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన కోలగట్ల వీరభద్ర స్వామికి  సీఎం జ‌గ‌న్ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ప్రతిపక్ష సభ్యులు కూడా డిప్యూటీ స్పీకర్ కోలగట్లకు అభినందనలు తెలియజేశారు.

తనకు మద్దతు తెలిపిన అందరికీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరి పైన ఉందన్నారు. సభ్యులు  సహకారాన్ని అందిస్తారని , సభ మర్యాదను, హుందాతనాన్ని పెంపొందించే విధంగా కృషి చేస్తానన్నారు. రెండు రోజుల క్రితమే వెలగపూడి లో శాసనసభ ప్రధాన కార్యదర్శి సమక్షంలో డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ లు దాఖలు చేశారు.

ఎవ్వరూ పోటీగా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో అసెంబ్లీలో సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు ప్ర‌క‌టించి…అనంత‌రం త‌న స్థానంలోనే డిప్యూటీ స్పీక‌ర్ గా ఎన్నికైన ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌ను సాద‌రంగా తోడ్కొని కూర్చోబెట్టారు. అంత‌కుముందు  స‌భ‌లో ఎమ్మెల్యే కోల‌గట్ల పేరు ప్ర‌క‌టించ‌గానే…ఎమ్మెల్యే కోల‌గ‌ట్లను మ‌ర్యాద పూర్వ‌కంగా..సీఎం జ‌గ‌న్…బుగ్గ‌న కోన  ర‌ఘుప‌తి త‌దిత‌ర  ఎమ్మెల్యే అంతా…శుబాకాంక్ష‌లుచెబూతూ ప్రొటోకాల్ గా ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌ను…స్పీక‌ర్ స్థానంలో కూర్చొబెట్టారు. ఈ సంద‌ర్బంగాద డిప్యూటీ  స్పీక‌ర్ కోల‌గట్ల మాట్లాడుతూ…స‌భా సంప్ర‌దాయాల‌ను…మ‌ర్యాద‌న‌ను కాపాడుతాన‌ని..స‌భ‌లో స‌భ్యుల అంద‌రి  అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాన‌ని చెప్పారు.

Related posts

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి కి మల్లురవి సంతాపం

Satyam NEWS

మాజీ ప్రధాని పివి నర్సింహారావు శత జయంతి వేడుకలు

Satyam NEWS

రామోజీరావు ఏం చేయబోతున్నారో?

Satyam NEWS

Leave a Comment