నిర్మల్ జిల్లా భైంస పట్టణంలో ఇటీవల జరిగిన మత ఘర్షణల లో నిరాశ్రయులైన హిందువులకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి నాయకుడు కొలను శంకర్ రెడ్డి అండగా నిలిచారు. మతోన్మాద మజ్లీస్ పార్టీ కార్యకర్తలు వందల సంఖ్యలో హిందువుల కుటుంబాలపై దాడులు చేసి అనేకమందిని నిరాశ్రయులను చేసిన విషయం తెలిసిందేనని, వారికి అండగా నిలబడటం తన కర్తవ్యంగా భావించారని శంకర్ రెడ్డి తెలిపారు.
సర్వస్వం కోల్పోయి ఇబ్బందుల పాలు అయిన హిందూ కుటుంబాలకు రెండు లక్షల ఒక వంద ఆరు రూపాయలు విరాళంగా అందచేసినట్లు ఆయన తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ కు ఆయన ఈ చెక్కును అందచేశారు. తన తల్లి తండ్రి కొలను వెంకట్ రెడ్డి, పార్వతమ్మ పేరిట ఈ సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు.