38.2 C
Hyderabad
April 25, 2024 12: 05 PM
Slider మహబూబ్ నగర్

పుర పోరు కు భారతీయ జనతా పార్టీ బస్తి బాట

yelleni 2

త్వరలో రానున్న పురపాలక ఎన్నికల సందర్భంగా కొల్లాపూర్ పురపోరుకు  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు  అధ్యక్షతన  కమలదళం పురవీధుల్లో  బస్తీ బాట పట్టారు. గురువారం పట్టణ కేంద్రంలోని  బి.సి.కాలనీలో సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి వేళల్లో  భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు కమలదళంతో  బీసీ కాలనీలో పర్యటించారు.

బస్తి బాటలో ఇంటింటికి తిరుగుతూ పాలకులకు ఓటు  వేసి గతంలో చేసిన పొరపాటు ప్రజలు మళ్లీ చేయవద్దని, బీజేపీపార్టీ ప్రధాని మోదీ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. బస్తీ బాటలో బీజేపీ కి అనూహ్య స్పందన లభించింది. ఈసందర్భంగా ఎల్లేని సుధాకర్ రావు గడపగడపకు తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఎన్నికల సమయం కన్నా ముందే ప్రజలు కమల పువ్వు గుర్తుకు పెట్టుకోవాలన్నారు. ఎన్నికలు వచ్చే వరకు సమయం ఉండొచ్చు. కానీ ఈసారి పురపాలక ఎన్నికల్లో కమల పువ్వు గుర్తుకు ఓటువేసి గెలిపించాలన్నారు. ఎన్నికలు వచ్చే సరికి దొంగ మాటలు చెప్పేవారు వస్తారన్నారు. వాళ్లతో జగ్రతగా ఉండాలన్నారు.

ఇప్పటికే  అవకాశం ఇచ్చి మోసపోయామన్నారు. మళ్ళీ మోసపోవద్దన్నారు. ప్రజలు ఎల్లేనికి భరోసా ఇచ్చారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి నమ్మి   ఓటు వేశాం. తర్వాత జరిగిన సంఘటనలు చూశాం ఇంకోసారి మోసపోమన్నారు. సోమశిల సిద్ధేశ్వర వంతెన బీజేపీ తోనే సాధ్యం అవుతుందని ఎల్లేని చెప్పారు. పురపాలక ఎన్నికలో బీజేపీకి అవకాశం ఇస్తే ప్రధాని మోదీ సంక్షేమాలతో కొల్లాపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ పురపాలక అధ్యక్షుడు కాకి సత్యనారాయణ గౌడ్, ప్రతినిధి గౌరం ధనుంజయ గౌడ్, మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్, బొమ్మరిల్లు భాస్కర్, అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు సందు రమేష్, ఎండి ఇమ్రాన్, కాశీపూరం మహేష్, రమేష్ రాథోడ్, పురేందర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

బొందిలి సంఘం స‌త్రం స్థ‌లానికి భూమిపూజ‌

Sub Editor

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది కీ వెల్లడి

Bhavani

81 శాతం మెరుగైన ఫలితాన్నిచ్చిన కోవ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment