కొల్లాపూర్ మండలంలోని రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారికి కొల్లాపూర్ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు.
కొల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాల రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని ఈ రోజు కొల్లాపూర్ వ్యవసాయ అధికారికి వినతిపత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు తమటం సాయికృష్ణ గౌడ్, మండల ఉపాధ్యక్షులు ఒరే శేఖర్ గడ్డం, శ్రీరామ్ యాదవ్, కాశీపురం మహేష్ ముదిరాజ్, షనమోని శివకుమార్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు మెంటే శివకృష్ణ యాదవ్ మ్యాదరి శివ గణమోని ఎల్లయ్య యాదవ్, ఎల్లెని నాగరాజు, దేశమని రమేష్ ముదిరాజ్, జర్పతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.