37.2 C
Hyderabad
April 19, 2024 14: 14 PM
Slider మహబూబ్ నగర్

రేవంత్ రెడ్డి విడుదలపై కొల్లాపూర్ లో సంబరాలు

kollapur congress

మల్కాజిగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి కి బెయిల్ మంజూరు అయ్యి  విడుదల కావడంతో కొల్లాపూర్ మండల పార్టీ అధ్యక్షులు పరశురాము నాయుడు ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా లో సంబరాలు నిర్వహించారు. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గాలి యాదవ్, మైనార్టీ సెల్ నాయకులు ముస్తఫా, రఫీ, మహమ్మద్లు బాణసంచా  కాల్చారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ దొర పాలనలో ప్రశ్నించినవారిని  జైలుకు పంపించే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.  అన్ని మీడియా ఛానల్స్ దొరల చేతుల్లో బందీ అయ్యాయని ఆయన అన్నారు. రేవంత్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు అని ఆరోపించారు. రేవంత్ తన అసలు రూపాన్ని చూపించే సమయం వచ్చిందని, దానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు మద్దతు ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్, క్రాంతి తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

Satyam NEWS

రియా చక్రవర్తి బెయిల్ తిరస్కరించిన న్యాయస్థానం

Satyam NEWS

నకిరేకల్ లో యూరియా కొరతను నివారించాలి

Satyam NEWS

Leave a Comment