27.7 C
Hyderabad
March 29, 2024 03: 22 AM
Slider ముఖ్యంశాలు

నిరంకుశ పాలన తో కొల్లాపూర్ ప్రజలు కష్టాలపాలు….!

#kollapur

అధికార అహంకార ధోరణి తో విర్రవీగుతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ప్రజలకోసం జైలుకే కాదు, ప్రాణాకైన ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని  కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చింతలపల్లి జగదీశ్వర్ రావు, ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

గత కొన్ని రోజుల క్రితం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూమిని కోల్పోయి పరిహారం అందలేదని కుడికిల్ల  గ్రామానికి చెందిన తలారి  బాలస్వామి గుండె పోటుతో చనిపోయారు. ఆ రైతు మృతదేహంతో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చింతలపల్లి జగదీశ్వర్ రావు, నాయకులు రైతు కుటుంబానికి న్యాయం జరగాలని ఆ ప్రాజెక్టుకు  సంబంధించిన కంపెనీ తో న్యాయపోరాటం చేశారు. 

ఆ రైతు కుటుంబానికి మూడు లక్షలు అందే విధంగా కృషి చేశారు. ఆ సందర్భంలో చింతలపల్లి జగదీశ్వర్ రావుతో పాటు  కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు అయ్యాయి. దానితో సోమవారం జైల్ కు వెళ్లారు. మంగళ వారం బెయిల్ పై విడుదల అయ్యారు.

ఈ కేసులతో భయపడే  ముచ్చట్టే లేదని  బెయిల్ పై బయటికి వచ్చిన చిన్నంభావి మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, నాయకులు అంటున్నారు. నియోజక వర్గంలో ప్రజల పక్షాన పోరాటానికి కాంగ్రెస్ నాయకులు పార్టీ సిద్ధంగా వుంటారని  చింతల పల్లి జగదీశ్వర్ రావు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుల పోరాటాలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకోలేరని వారు అంటున్నారు. అధికార మదం తో టిఆర్ఎస్ నాయకులు చివరికి  మతిస్థిమితాన్ని కోల్పోయి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారన్నారు. ప్రజలను కష్టాల పాలు చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు.

స్వార్థ ప్రయోజనాల కోసం అడుగులకు మడుగులు ఎత్తే వారిని చూస్తూనే వున్నారు. అలాంటి వారు కాంగ్రెస్ పార్టీలో వుండరు అని అంటున్నారు. ప్రజల అభివృద్ధి కోసమే, ప్రజల కష్టాలపై నిరంతరం పోరాటాలు చేయడానికి మాత్రమే  కాంగ్రెస్ పార్టీ బానిస అవుతుంది తప్ప, అధికారాన్నికి  కానే కాదని ఆయన స్పష్టత ఇస్తున్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

పెండింగ్ స్కాలర్‌షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

ప్రభుత్వం సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

Murali Krishna

లకారంపై అట్టహాసంగా ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment