నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి 98 జీవో బాధితులను మోసం చేశారని శ్రీశైలం భూ నిర్వాసితులు ఆరోపించారు. బుదవారం చిన్నంబావి మండల కేంద్రంలో 98జివో శ్రీశైలం భూ నిర్వాసితులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం చేస్తావా?చెయ్యవా? లేదా రాజీనామా చేస్తావా అంటూ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని 98 జీవో శ్రీశైలం భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు.నాలుగు సార్లు గెలిపించిన జూపల్లి కృష్ణారావు చేయలేకపోయారు.నేను చేస్తా అని చెప్పి ఇప్పటికీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలన ముగిసిన ఇంతవరకు 98జీవో బాధితులకు న్యాయం చేయలేదన్నారు.
రాజీనామా కూడా చేయలేదన్నారు.చిన్నంబాయి మర్రిచెట్టు ఎమ్మెల్యే రాజీనామా కోసం ఎదురు చూస్తుందన్నారు.
తాజా మాజీ లారా! పొద్దస్తమానం మీదే నా! గొడవ, మా గొడవ వినరా! 11,000 మంది నిర్వాసితుల కంటే మీ ఇద్దరే ఎక్కువనా? న్యాయం చేస్తారా! ఇద్దరినీ ఇంటికి సాగనంపాలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజీనామా చేసేదాకా రాజీపడేది లేదని శ్రీశైలం భూ నిర్వాసితుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జోగు రామచంద్ర సాగర్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ మాదాసి కురువ పెద్ద మల్లయ్య, నాగేశ్వరరాజు, నాయకులు కాంత రెడ్డి, జగన్నాథ రావు, సురేష్, జహంగీర్, కంది మదిలేటి, ఆచారి, రాఘవేందర్ శెట్టి, రంగస్వామి, కాశన్న యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, కొల్లాపూర్