భారీ వర్షానికి నిరాశ్రయులైన వారికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే తన సొంత డబ్బుతో సాయం చేశారు. కొల్లాపూర్ పట్టణం లోని 12 వ వార్డ్ వడ్డెర కాలని భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైంది. దాంతో పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారి ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే సొంత ఖర్చులతో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పలువురు బాధితులకు ఈ రోజున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖరచారి పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మహమూదా బేగం ఖాదర్ పాషా, కౌన్సిలర్ పబ్బ హైమావతి ఎల్లగౌడ్, కో ఆప్షన్ మెంబర్ రుక్మద్దిన్, టిఆర్ఎస్ నాయకులు మూర్తి తదితరులు పాల్గొన్నారు.