అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు లక్షల రూపాయల సాయాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంజూరు చేయించారు.
వీపనగండ్ల మండలం పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన V.చంద్రయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి మెరుగైన వైద్య సహాయం కోసం రూ.3,00,000 ల ఎల్వోసిని ఎమ్మెల్యే మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి కి చంద్రయ్య కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలిపారు.