32.2 C
Hyderabad
April 20, 2024 22: 04 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ఎమ్మెల్యే కనిపించడం లేదు

#rangineni

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగినేని అభిలాష్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 26న ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డిని ప్రగతి భవన్ కు తీసుకెళ్లారని, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన నియోజకవర్గానికి కూడా రాలేదని రంగినేని తెలిపారు. ఎమ్మెల్యేను బయటికి రానివ్వకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ఖైదీలుగా ప్రగతి భవన్ లోనే ఎందుకు నిర్బంధించారో చెప్పాలని రంగినేని డిమాండ్ చేశారు.

MLAలు బయటకు వస్తే TRS, BJP పార్టీలు కలిసికట్టుగా చేస్తున్న నాటకాలు, నీచ రాజకీయాలు ప్రజలకు తెలుస్తాయని KCR  భయపడుతున్నారా ? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేను కాపాడి తిరిగి నియోజకవర్గానికి తీసుకురావాలని పోలీసులను కోరామని ఆయన తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ శాసన సభ్యుడు గత 36 రోజులుగా నియోజకవర్గంలో ఎక్కడ కనబడటం లేదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కంటే శివన్న, జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రెటరీ రఫీ ఉద్దీన్, కొల్లాపూర్ టౌన్ ఉపాధ్యక్షుడు బాబా, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు తగిలి కృష్ణయ్య, రాష్ట్ర సోషల్ మీడియా సెక్రెటరీ మొట్టే పరమేష్, పెంట్లవెల్లి మండల యూత్ కాంగ్రెస్ బోగ్యం నరసింహ నాయుడు, తాలూకా సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేష్ యాదవ్, ఎల్లూరు గ్రామ అధ్యక్షుడు పరశురాం యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమ్మన్న నాయుడు, నరసింహ, హుస్సేన్,సూర్య నారాయణ, పరమేష్, కృష్ణ, శరత్ గౌడ్, మహమూద్, అశోక్, శ్రీను, గంగాధర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా విషయం లో భయబ్రాంతులకు లోను కావద్దు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Satyam NEWS

పరమ భాగవతోత్తముడు నారాయణతీర్థుడు

Satyam NEWS

Leave a Comment